|
| అవినీతి విష వృక్షాన్ని పెకలిస్తాం: చిరంజీవి |
| శ్రీకాకుళం, 12 అక్టోబర్ 2008 ( 11:19 IST ) | |
రాష్ట్రంలో అవినీతిని అణిచివేసేందుకు ప్రజారాజ్యం పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ప్రకటించారు. అవినీతిపై యుద్ధభేరి మోగిస్తామని తెలిపారు. అవినీతి విష వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజా అంకిత యాత్రలో భాగంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శనివారం శ్రీకాకుళం జిల్లాలోని పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం మండలాల్లో రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల (ఈబీసీ) విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. డిగ్రీ పూర్తైన వెంటనే విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు ప్రోత్సహకాలు ఇస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రజా నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. మత్స్యకారులకు ప్రత్యేక ప్రాంతాలు కేటాయిస్తామన్నారు. కొబ్బరికి కూడా గిట్టుబటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|