|
| దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భక్తుల హింస |
| కర్నూలు, శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 13:12 IST ) | |
కర్నూలు జిల్లా, హొళగంద మండలం, దేవరగట్టులో జరుగుతున్న బన్ని ఉత్సవాలలో భాగంగా గురువారం అర్థరాత్రి భక్తులు కర్రలతో యుద్ధానికి దిగగా, పలువురికి తలలు పగిలాయి. దీంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
శ్రీ మాళా మల్లేశ్వరస్వామి జైత్రయాత్రను ఈ బన్ని ఉత్సవాలుగా నిర్వహిస్తున్న భక్తులు స్వామి వారిని తమ గ్రామంలోనే ఉంచుకునేందుకై ఈ కర్రలతో యుద్ధం సాగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి కాక కర్ణాటకనుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు.
అదే క్రమంలో గురువారం రాత్రి కూడా నెరణికి, నెరణికి తాండ, కొత్త పేట గ్రామాల ప్రజలు దేవుడిని ఇతర గ్రామాల వారు తీసుకెళ్లకుండా ఉండేందుకై ఈ యుద్ధం సాగించారు. ఈ సందర్భంగా ఇనుప తీగలు చుట్టిన కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|