|
| సీఎంను కలిసిన వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ |
| హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 16:28 IST ) | |
వరంగల్ కార్పొరేషన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సీఎం రాజశేఖర రెడ్డితో చర్చించటానికి ఆ నగర మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మంగళవారం కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీరిద్దరి సమావేశం పావుగంటసేపు జరిగింది. వరంగల్ నగరపాలకసంస్థలో చేపట్టిన అభివృద్ధి పనులు గురించి వీరివురూ చర్చించారు. కొన్ని పథకాల అమలుకోసం ప్రభుత్వం సాయం అందించాలని సీఎంను మేయర్ స్వర్ణ విజ్ఞప్తి చేశారు.
వరంగల్ నగరపాలకసంస్థలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను స్వర్ణ వివరించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు తిరుగుబాటుకు గల కారణాలను వైఎస్కు తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్లలో అందరూ అసంతృప్తితో లేరని స్పష్టం చేశారు. కొంతమంది కావాలని చేస్తున్న పని చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు చొరవ తీసుకుంటే ఈ సమస్య కొలిక్కి వస్తుందని సీఎంకు స్వర్ణ తెలియజేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|