|
| అరచేతిలో స్వర్గం ఎవరూ చూపలేరు: డీఎస్ |
| హైదరాబాద్, మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 18:37 IST ) | |
రాష్ట్రంలోని కొత్త రాజకీయ పార్టీలు అరచేతిలో స్వర్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు తమ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ పాలనలో ప్రజలకు అవసరమైనవన్నీ సమకూరుతున్నాయని చెప్పారు. ప్రజలకు సుపరిపాలనను తాము మాత్రమే అందించగలమని స్పష్టం చేశారు.
చిరంజీవి రాజకీయ పార్టీ, విధివిధానాలు ప్రకటించిన తర్వాతే వారి గురించి వ్యాఖ్యానిస్తామని చెప్పారు. చిరంజీవి రాకతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న కొందరి పగటి కలలు నిజం కావన్నారు. నర్సాపురం మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు చేగొండ హరిరామ జోగయ్య రాజీనామా వల్ల తమకు వచ్చే నష్టం లేదని శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|