|
| సాగునీటి ఇబ్బందులు తీరిపోతాయి: వైఎస్ |
| వెలిగొండ, మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 18:24 IST ) | |
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సాగునీటి సమస్యలు తీరిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో దోర్నాల మండలంలో వెలిగొండ వద్ద సొరంగం తొలిచే పనులను సీఎం వైఎస్ మంగళవారం ప్రారంభించారు. కృష్ణా నది వరద నీటిని ప్రకాశం జిల్లాలో సాగునీటి అవసరాలకు వినియోగించుకొంటానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు.
వెలిగొండ పథకం అమలు ద్వారా 1.19 వేల ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుందని తెలిపారు. వెలిగొండ వద్ద సొరంగాన్ని 18.8 కి.మీ మేర తొలుస్తారని వివరించారు. సొరంగం తొలిచే పనులు నల్లమల అటవీ ప్రాంతం గుండా సాగుతుందన్నారు. ఈ పనుల కోసం రూ.2011 కోట్లు వెచ్చించామన్నారు. వెలిగొండ తొలి దశ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|