యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
బీజేపీతో పొత్తుకు చిరంజీవి పార్టీ, తెరాస ఆసక్తి
న్యూఢిల్లీ, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 15:17 IST )
ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి ఏర్పాటుచేయబోయే పార్టీతోపాటు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లు తమతో పొత్తు కోసం ఆసక్తి కనబరుస్తున్నాయని భాజపా తెలిపింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఇది తార్కాణమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ప్రతినిధి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు. దీనిపై ఆ పార్టీలు తమతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. ఎన్నికలు సమయానికి పొత్తు ఖరారు అవుతుందన్నారు.

ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం వ్యవహారశైలితో ప్రజలు విసిగిపోయారు. లోక్‌సభలో సీట్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమని తెలిపారు. ఏపీలో మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లను తాము లేదా తమ కొత్త కూటమి కైవసం చేసుకుంటే కేంద్రంలో భాజపా కూటమి అధికారంలోకి రావడం తేలిక అవుతుందని అభిప్రాయపడ్డారు. భాజపా 1999లో తెలుగుదేశంతో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన సంగతిని జావడేకర్ గుర్తుచేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భాజపా అగ్రనేత అద్వానీతో చర్చలు జరిపిన చిరంజీవి
నెల్లూరు జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రులు
కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులపై ఛార్జీల మోత
వంశధార నది ఎడమ కాల్వకు గండి
చిరంజీవిలో సేవాభావం: గాయకుడు బాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...