యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
భాజపా అగ్రనేత అద్వానీతో చర్చలు జరిపిన చిరంజీవి
హైదరాబాద్, 19 ఆగస్టు 2008   ( 13:23 IST )
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ప్రధానమంత్రి అభ్యర్ధి ఎల్‌కే అద్వానీతో చిరంజీవి మంగళవారం ఫోన్‌లో మంతనాలు జరిపారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అద్వానీతో జరిపిన తాజా మంతనాలకు ప్రాధాన్యత చేకూరింది. రాజకీయ రంగ ప్రవేశంపై చిరంజీవి ఫోన్‌లో అద్వానీ ఆశీర్వాదం పొందినట్టు తెలిసింది.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పేరును, విధివిధానాలను ఆగస్టు 26న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో ప్రకటించనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పార్టీ కోసం రాష్ట్రంలో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తిరుపతిలో జరిగే బహిరంగ సభకు సంబంధించిన పనులు మరోవైపు చురుగ్గా సాగుతున్నాయి.

నర్సాపురం మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మంగళవారం చిరు పార్టీలో చేరారు. చిరు పార్టీ కార్యాలయంలో మెగాస్టార్‌ చిరంజీవిని కలుసుకున్నారు. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన జోగయ్య అనుభవాన్ని తాము పూర్తిగా వినియోగించుకుంటామని చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నెల్లూరు జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రులు
కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులపై ఛార్జీల మోత
వంశధార నది ఎడమ కాల్వకు గండి
చిరంజీవిలో సేవాభావం: గాయకుడు బాలు
కొత్త పార్టీలు ఏమీ చేయలేవు: నటుడు రాజశేఖర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...