|
| విజన్ 2020నే అమలు: చంద్రబాబు నాయుడు |
| హైదరాబాద్, సోమవారం, 18 ఆగస్టు 2008 ( 16:45 IST ) | |
తెలుగుదేశం పార్టీ గతంలో తాము రూపొందంచిన విజన్ 2020లోని అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మీకోసం యాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత హైదరాబాద్లో తొలిసారి ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో చంద్రబాబు మాట్లాడారు. మీకోసం యాత్ర 117 రోజుల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వారినడిగి నేరుగా తెలుసుకున్నామన్నారు.
కాంగ్రెస్ పరిపాలనా కాలంలో ప్రజలకు కష్టాలు మాత్రమే మిగిలాయన్నారు. ప్రధాన సమస్యలను పక్కనపెట్టి జలయజ్ఞం పేరుతో భారీగా నిధులు దండుకునే పనిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని నిప్పులుగక్కారు. చేనేత పరిశ్రమ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల నష్టం సంభవించిన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|