|
| నెల్లూరు జిల్లాలో 2లక్షల మంది ఓటర్లు గల్లంతు |
| నెల్లూరు, సోమవారం, 18 ఆగస్టు 2008 ( 16:26 IST ) | |
నెల్లూరు జిల్లాలో తాజాగా జరిగిన ఓటర్ల జాబితా సవరణలో దాదాపు రెండు లక్షల మందిపేర్లు గల్లంతయ్యాయని తెలిసింది. జాబితాలో కొత్తవారికి అవకాశం కల్పించకపోయినా ఉన్నవారి పేర్లు తొలగించటమేమిటని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఓటర్ల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టడం గమనార్హం. ప్రతిసారి జాబితా మార్పులపుడు 5శాతం మేర ఓటర్లు కొత్తగా చేరుతుంటారు.
జిల్లాలో కొత్తగా అర్హులైన లక్షమందికి ఓటర్ల జాబితాలో చోటుదక్కాల్సిఉంది. ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకుని జాబితాలో స్థానం సంపాదించటం అంత తేలిక కాదన్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జిల్లాలో 11 స్థానాలు ఉండగా నేడది పదికి పడిపోయింది. ఓటర్ల జాబితా సవరణకు ఆగస్టు 31వ తేదీ వరకూ ఎన్నికల సంఘం గడువు పొడిగించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|