|
| కొవ్వాడ గండితో పోలవరం మండంలో వరద ముంపు |
| ఏలూరు, సోమవారం, 18 ఆగస్టు 2008 ( 15:44 IST ) | |
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో కొవ్వాడ కాల్వకు గండి పడటంతో పంట పొలాలు, గ్రామాలు ముంపుకు గురయ్యాయి. బాధితులకు ఇంకా సహాయ చర్యలు అందలేదని వార్తలు వస్తున్నాయి. కొవ్వాడ కాల్వ ఎడమ గట్టుకు 75 మీటర్ల నిడివిలో గండి పడింది. దీని ద్వారా వరద నీరు ఉధృతంగా సమీప గ్రామాలపై విరుచుకుపడింది. పట్టిసీమ, పోలవరం, గూటాల, రాగోలపల్లి గ్రామాల్లో 9వేల ఎకరాల్లో వివిధ పంటలు నీటమునిగాయి.
అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి కారణంగానే ఈ గండి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరద నీటి ప్రవాహం ధాటికి పొలాల్లో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. పూడికలు పేరుతో లంకలను తవ్వేయడంతో కాల్వకు గండి పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరుసగా మూడోసారి ఈ వరదలను చూస్తున్నామని రైతులు అంటున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|