యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
గ్రామీణ విద్యుదీకరణ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్, గురువారం, 7 ఆగస్టు 2008   ( 16:54 IST )
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం వివరాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ విలేకరులకు వెల్లడించారు. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ.814 కోట్ల నిధులు కేటాయించామని షబ్బీర్ అలీ తెలిపారు.

ఈ పథకం కింద ఇప్పటివరకు 14 లక్షల మందికి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. ఈ పథకం కింద 125 రూపాయలకే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తున్నామని, ఈ ఏడాది మరో 12 లక్షల మందికి కొత్త కనెక్షన్లు మంజూరు చేయనున్నామని రాష్ట్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే వర్షాలు బాగానే కురుస్తున్నప్పటికీ రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇంకొంత సమయం పడుతుందన్నారు.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి వెంటనే ప్రారంభించడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయం విడుదలవున్న నీరు ఇప్పటిలాగే కొనసాగితే మరో వారం రోజుల తరువాత ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యపడుతుందని షబ్బీర్ అలీ వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఉగ్రరూపం దాల్చిన గోదావరి: యానంలోకి వరద నీరు
ఎరువుల కొరత: రేపు రైతు సంఘాల ఆందోళన
రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేత
రాజధానిలో పాఠశాలల విలీనంపై పట్టువీడిన ప్రభుత్వం
గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
త్వరలో ఆరోవ వేతన సంఘం సిఫార్సుల అమలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...