|
| రాజధానిలో పాఠశాలల విలీనంపై పట్టువీడిన ప్రభుత్వం |
| హైదరాబాద్, గురువారం, 7 ఆగస్టు 2008 ( 16:29 IST ) | |
రాష్ట్ర రాజధానిలో విలీనం పేరుతో మూసివేసిన పాఠశాలలను మళ్లీ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పక్కపక్కన, ఒకే ప్రాంగణంలో ఉన్న పాఠశాలలను అకడమిక్ క్లబ్బింగ్ పేరిట ప్రభుత్వం సుమారు 200 స్కూళ్లను మూసివేసింది. ఈ 200 పాఠశాలలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ ఇందిరాపార్కు వద్ద మూడు రోజుల క్రితం ఆమరణ నిరాహర దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్షలకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించడం, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ వివాదంపై దృష్టి సారించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|