|
| మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ప్రకటన |
| హైదరాబాద్, బుధవారం, 6 ఆగస్టు 2008 ( 16:44 IST ) | |
రాష్ట్రవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.1 లక్ష పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బుధవారం సచివాలయంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలో మృతుల కుటుంబాలకు రూ.1 పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.
అంతేకాకుండా వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేశారు. పంటనష్టం వివరాలు పూర్తిస్థాయిలో తెలియకపోవడం వలన, ఇందుకు సంబంధించిన పరిహారంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. వర్షాల కారణంగా ఇళ్లు పోగొట్టుకున్నవారికి రూ.4 వేలు పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|