|
| పొత్తులపై బీజేపీతో చర్చలు అవాస్తవం: గౌడ్ |
| హైదరాబాద్, 18 జులై 2008 ( 11:25 IST ) | |
బీజేపీతో ఎన్నికల పొత్తుకు సంబంధించి చర్చలు జరిపినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని నవతెలంగాణ ప్రజాపార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. తమ పార్టీ ఇంకా సంస్థాగత నిర్మాణ దశలోనే ఉందని, ఇంకా ఎవ్వరూ తమ పార్టీ వద్ద పొత్తుల ప్రస్తావన తీసుకురాలేదన్నారు.
మహబూబ్నగర్ జిల్లానుంచి ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ఆందోళనలు ప్రారంభించనున్నామని ప్రకటించారు. తెలంగాణ భూములను సెజ్ల పేరుతో ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు.
తమ పార్టీ తరపున సింగరేణి కార్మికుల సమస్యలపై గోదావరి ఖనిలో 18న, రైతు సమస్యలపై మెదక్ జిల్లాలో ఆగస్టు2న, నిజామాబాద్ జిల్లాలో 3న ఆందోళనలు చేపడుతామని తెలిపారు. అలాగే జూలై 26న తెలంగాణ న్యాయవాదుల సదస్సు, 27న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|