|
| కాంగ్రెస్, తెరాసలు ప్రజలను మోసగిస్తున్నాయి: కడియం |
| జఫర్గడ్ (ఏజెన్సీ), 19 మే 2008 ( 10:36 IST ) | |
అభివృద్ధి పేరిట కాంగ్రెస్, తెరాసలు ప్రజలను మోసం చేస్తున్నాయని టీడీపీ నేత కడియం శ్రీహరి దుయ్యబట్టారు. ఆరునెలల వ్యవధిలోనే తెలంగాణను తీసుకువస్తామని చెప్పిన కేసీఆర్ ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేక తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఉపఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న కడియం శ్రీహరి ఆదివారం ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశంపై వీలైనంత వరకు టీడీపీ సానుకూల నిర్ణయమే తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని జఫర్గడ్ మండలంలో ఉన్న పలు గ్రామాల్లో కడియం ఉపఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|