|
| ఇళ్ల పట్టాల కోసం మంత్రి ఇంటి వద్ద పేదల ధర్నా |
| హైదరాబాద్, మంగళవారం, 13 మే 2008 ( 14:54 IST ) | |
తాము ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలకు పట్టాలిప్పించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద పేదలు ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారు ఈ ధర్నా చేపట్టారు.
అనంతరం మంత్రి వచ్చి వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించడంతో పాటు ఎన్నికల తర్వాత వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు తమ ధర్నాను విరమించారు.
రంగారెడ్డి జిల్లా, శామీర్ పేట మండలం, జవహర్ నగర్ ప్రాంతంలోని తమ నివాసాలను ఖాళీ చేయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు మంత్రిని ఈ సందర్భంగా కోరారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|