|
| రైతు చైతన్య యాత్రలకు ఎన్నికల సంఘం అనుమతి
|
| హైదరాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 13:51 IST ) | |
త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్న జిల్లాల్లో రైతు చైతన్య యాత్రలు చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావు వెల్లడించారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రైతు చైతన్య యాత్రలకు సంబంధించిన అనుమతులు వచ్చాయని చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో షరతులకు లోబడి రైతు చైతన్య యాత్రలు, రైతు సదస్సులు నిర్వహించవచ్చని తెలిపారు.
రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఇవి పూర్తి అధికారిక కార్యక్రమాల్లో జరగాలని ఎన్నికల సంఘం షరతు విధించినట్టు ఐవీ సుబ్బారావు తెలిపారు. రైతు చైతన్య యాత్రలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|