యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అంగరంగ వైభవంగా నరసింహస్వామి చందనోత్సవం
విశాఖపట్నం (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 14:29 IST )
విశాఖ జిల్లాలోని సింహాచలంలోని శ్రీ వరాహ నరసింహస్వామి వారి పవిత్ర పుణ్యక్షేత్రంలో చందనోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచే కాకుండా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఈ ఉత్సవంలో భాగంగా మొదట స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, ఆ తర్వాత వేద మంత్రాలతో స్వామి వారి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించారు. వెండి కలశాలలో నింపిన గంగాజలంతో స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని సకలాభరణాలతో అలంకరించారు.

స్వామి వారి ఎదపై, శిరస్సుపై పచ్చి చందనాన్ని అలంకరించి దర్శనానికి భక్తులను అనుమతించినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. చందనోత్సవ గంధాన్ని గృహంలో ఉంచడం ద్వారా ఆ ఇంట్లో సుఖ, సంతోషాలతో పాటు ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే దీనిని నీటిలో కలిపి త్రాగడం ద్వారా సకల వ్యాధులు నయమవుతాయని భక్తులు భావిస్తారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదు: చంద్రబాబు
విష్ణువర్దన్‌కు ఆదరణ ఇవ్వండి: డీఎస్ విజ్ఞప్తి
ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు: ఎన్‌ఎంయూ
ఆయన హద్దులు మీరుతున్నారు: దేవేందర్
దళితుల పదోన్నతులపై వేధింపులు: మారెప్ప
బ్రిటన్‌లో ఆంధ్ర వైద్యవిద్యార్థిని హత్య
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace