|
| ప్రధానిగా మన్మోహన్కు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009 ( 09:17 IST ) | |
దేశ ప్రధానిగా మరోసారి పగ్గాలు చేపట్టేందుకు మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ బుధవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకున్న 274మంది ఎంపీల మద్దతుకు సంబంధించిన పత్రాలను మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలు రాష్ట్రపతికి అందజేశారు.
సోనియా, మన్మోహన్లు చూపించిన మద్దతుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రపతి సర్కారు ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరారు. అదేసమయంలో శుక్రవారం ప్రధానిగా ప్రమాణం చేయాలంటూ మన్మోహన్కు రాష్ట్రపతి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన మన్మోహన్కు శుభాకాంక్షలు తెలిపారు.
15వ లోక్సభలో అతిపెద్ద పార్టీకి, అతిపెద్ద కూటమికి మన్మోహన్ నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్న రాష్ట్రపతి ఆయనను ప్రధానిగా నియమించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. అలాగే మంత్రిమండలిలోకి ఎవరెవరినీ తీసుకుంటారనే విషయాన్ని తనకు తెలియజేయాల్సిందిగా ఆమె మన్మోహన్ను కోరారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|