|
| కసబ్ ఐడీ కార్డు నకిలీది: హైదరాబాద్ ప్రిన్సిపాల్ |
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 09:02 IST ) | |
ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుడు మొహమ్మెద్ అజ్మల్ అమీర్ కసబ్ వద్ద దొరికిన ఐడీ కార్డు నకిలీదని రాష్ట్ర రాజధానికి చెందిన ఓ కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక కోర్టుకు తెలియజేశారు. కసబ్ తమ కళాశాల విద్యార్థి కాదని స్పష్టం చేశారు. గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన దాడుల్లో పాల్గొన్న పది మంది ఉగ్రవాదుల్లో కసబ్ ఒక్కడే భద్రతా దళాలకు ప్రాణాలతో దొరికిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ముంబయి దాడులకు సంబంధించి అనేక కేసుల్లో అజ్మల్ కసబ్ నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనికి సంబంధించి జరుగుతున్న కోర్టు విచారణకు హైదరాబాద్లోని అరుణోదయా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ హాజరయ్యారు. కసబ్ వద్ద ఈ కళాశాలకు చెందిన ఏడు ఐడీ కార్డులు దొరికాయి. ఇందులో ఒకటి కసబ్ ఐడీ కార్డుకాగా, మిగిలిన ఆరు అతని సహచరులకు చెందినవిగా గుర్తించారు.
ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన కోర్టు విచారణలో కసబ్ ఐడీ కార్డు నకిలీదని, అతను తమ కళాశాల విద్యార్థి కాదని అరుణోదయా ప్రిన్సిపాల్ జి.రాధాకృష్ణన్ తెలిపారు. ముంబయి దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు తాము పాకిస్థానీయులమని తెలియకుండా ఉండేందుకు ఈ ఐడీ కార్డులు వాడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది.
కసబ్ను మీ కళాశాలలో చూశారా అని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నకు రాధాకృష్ణన్ సమాధానమిస్తూ.. ఇతను తమ కళాశాల విద్యార్థి కాదని చెప్పారు. తమ కళాశాలతో చదువుతున్న 600 మంది విద్యార్థులు తనకు వ్యక్తిగతంగానూ తెలుసన్నారు. వారిలో కసబ్ లేడని తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|