|
| పాక్ వాదన కూడా నమ్మశక్యంగా లేదు: భారత్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009 ( 12:37 IST ) | |
ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి తామందించిన సాక్ష్యాధారలపై పొరుగు దేశం వినిపిస్తున్న వాదనలోనూ విశ్వసనీయత లేదని భారత్ ఎదురుదాడికి దిగింది. ముంబయి దాడులపై భారత్ అందించిన సాక్ష్యాలు, తాము చర్యలు తీసుకునేందుకు సరిపోవని పాక్ ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సాక్ష్యాలు అందించిన తరువాత కూడా పాకిస్థాన్ పాత ధోరిణితోనే వ్యవహరిస్తుందని పేర్కొంది. పాక్ వాదనలోనూ విశ్వసనీయత లేదు. ఇంతకుముందులాగే వాస్తవాలను, సాక్ష్యాధారాలను పాక్ తోసిపుచ్చుతుంది. వాళ్లు (పాకిస్థాన్) ఏదో ఒకటి చెబుతారు. కాని చేసిది మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.
ముంబయి దాడులు జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు పాక్ వాస్తవాలను తోసిపుచ్చే ధోరణితోనే వ్యవహరిస్తుందని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ విమర్శించారు. భారత్ అందించిన సాక్ష్యాలపై పాక్ స్పందనను ప్రస్తావించగా, ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు ఈ సాక్ష్యాలను అసలు పరిశీలించాయా? వాటిపై దర్యాప్తు జరిపాయా? అని ప్రశ్నలు సంధించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|