|
| ఐటీ సంస్థలకు ఈ మెయిల్ బెదిరింపులు |
| బెంగుళూరు (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 09:12 IST ) | |
కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ప్రముఖ ఐటీ సంస్థలకు తీవ్రవాద సంస్థల పేరుతో బెదిరింపు ఈ మెయిల్లు వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ముంబయి దాడుల్లో పాల్గొన్నవారి కంటే ఎక్కువ సంఖ్యలో తీవ్రవాదులు ఈ దాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ ఈ మెయిల్స్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ విషయమై ఆదివారం పోలీసుశాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ నగరంలోని ప్రముఖ ఐటీ సంస్థలైన విప్రో, ఇన్పోసిస్, యాక్సెంచర్, క్రేన్స్ తదితర సంస్థలకు ఈ బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చినట్టు నిర్ధారించారు. అలాగే తమ దర్యాప్తు సందర్భంగా ఈ మెయిల్స్ అమెరికా నుంచి వచ్చినట్టు వారు పేర్కొన్నారు.
ఈ నేపధ్యంలో ఐటీ సంస్థల అధికారులతో తాము చర్చించామని పోలీసులు తెలిపారు. సంస్థల భద్రత కోసం వారి వద్ద ఉన్న ప్రైవేటు సెక్యురిటీతో పాటు అదనంగా పోలీసు భద్రతను సైతం కట్టుదిట్టం చేసినట్టు వారు చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|