|
| యూపీఏ వైఫల్యాలపై 16నుంచి బీజేపీ జనాందోళనలు |
| బెంగుళూరు(ఏజెన్సీ), 4 జనవరి 2009 ( 17:14 IST ) | |
యూపీఏ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ జనవరి 16నుంచి నెలరోజుల పాటు జనాందోళనలను నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఉగ్రవాదంపై యూపీఏ సర్కారు మెతక వైఖరి, వ్యవసాయంపై నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య తదితరాలపై తమ జనాందోళనల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నామన్నారు.
బెంగుళూరులో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మార్చి- ఏప్రిల్లో పార్లమెంటరీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున ప్రచారాన్ని కాస్త ముందుగానే ప్రారంభించనున్నామని తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై జనవరి 19న సమావేశం నిర్వహించనున్నామని వెల్లడించారు. నెలాఖరుకల్లా అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల వ్యూహం ఖరారు చేసేందుకై ఫిబ్రవరి 6నుంచి మూడు రోజుల పాటు నాగ్పూర్లో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|