|
| పూంచ్లో కొనసాగుతున్న భీకర కాల్పులు |
| శ్రీనగర్ (ఏజెన్సీ), ఆదివారం, 4 జనవరి 2009 ( 13:31 IST ) | |
జమ్ము కాశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో భద్రతా దళాలు, వేర్పాటువాద తీవ్రవాదుల మధ్య కాల్పులు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, నలుగురు తీవ్రవాదులు కలిపి మొత్తం ఏడుగురు మరణించారు.
రహస్య స్థావరాల్లో తీవ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో గురువారం మంధేర్ సమీపంలోని పర్వత ప్రాంతాలను ముట్టడించిన సందర్భంగా ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి. అక్కడ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థల అగ్రశ్రేణి కమాండర్లు అక్కడ ఉన్నట్టు సమాచారం అందింది.
ఉధంపూర్లోని సైనిక నార్తర్న్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ కచారీ మాట్లాడుతూ నలుగురు తీవ్రవాదులను హతమార్చినా వారి మృత దేహాలను స్వాధీనం చేసుకోలేదన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు సైనిక, పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|