|
| యువశక్తికి ఆహ్వానం పలకండి: ప్రధాని |
| షిల్లాంగ్ (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009 ( 13:05 IST ) | |
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరిగే పరిశోధనల్లో యువత ఎక్కువగా పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్ శాస్త్రవేత్తలను కోరారు. తద్వారా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో యువకుల ప్రతిభను ప్రోత్సహించాల్సిందిగా ఆయన కోరారు.
షిల్లాంగ్ యూనివర్సిటీలో శనివారం ప్రారంభమైన 96వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ సభలో మన్మోహన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం యువత వల్లే అభివృద్ధి చెందగలదని పేర్కొన్నారు. అందుకే మన విద్యా సంస్థలు యువత అవసరాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కారణంగానే పరిశోధనల్లో యువత నేతృత్వం వహించే విధంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సైతం విద్యా సంస్థలు పరిశోధనల్లో పాలుపంచుకునేలా కృషి చేస్తుందని అన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|