|
| పేరు మార్చినా నిషేధం విధించాల్సిందే: ప్రణబ్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009 ( 09:09 IST ) | |
తీవ్రవాద సంస్థలు పేర్లు మార్చుకున్నా వాటిపై పాకిస్థాన్ నిషేధం విధించే తీరాలని భారత్ విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఈ మేరకు అంతర్జాతీయ సమాజం సైతం పాక్పై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై ప్రణబ్ మాట్లాడుతూ గతంలో లష్కరే తోయిబాను ఐక్యరాజ్య సమితి నిషేధిస్తే అది జమాత్గా పేరు మార్చుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు జమాత్ను కూడా నిషేధించడంతో మరో కొత్త పేరుతో తెరపైకి రావడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
అందుకే ఉగ్రవాద సంస్థలు పేరు మార్చుకున్నా వాటిని నిషేధించడంలో పాకిస్థాన్ ఉపేక్షించరాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జమాత్ సంస్థను నిషేధించిన కారణంగా అది తెహ్రీక్ ఏ హుర్మత్ ఏ రసూల్ అనే పేరుతో మళ్లీ తెరపైకి రావడానికి ప్రయత్నిస్తోందన్న వార్తల మధ్య ప్రణబ్ పై విధంగా పేర్కొనడం గమనార్హం.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|