|
| తీవ్రవాదంపై కఠిన వైఖరి ప్రదర్శిస్తాం: ప్రధాని |
| గౌహతి (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009 ( 08:30 IST ) | |
తీవ్రవాదాన్ని తుదముట్టించడంలో తాము కఠిన వైఖరితో వ్యవహరిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అసోం రాష్ట్రంలోని గౌహతిలో గురువారం జరిగిన పేలుళ్లకు కారణమైనవారిని త్వరలో పట్టుకుని శిక్షిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అసోం పేలుళ్ల తర్వాత అక్కడి బాధితులను పరామర్శించేందుకై ప్రధాని శుక్రవారం గౌహతి చేరుకున్నారు. గౌహతి విమానాశ్రయంలో ప్రధానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని గురువారం బాంబు పేలుళ్ల సందర్భంగా క్షతగాత్రులై గౌహతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బాంబు పేలుళ్ల సందర్భంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 2లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ. లక్ష సాయం అందించనున్నట్టు తెలిపారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన సాయం అందించాల్సిందిగా ఆయన ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు.
అదేసమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గౌహతీ పేలుళ్ల వెనుక సూత్రధారుల గురించి అప్పుడే మాట్లాడలేమని ఆ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని వ్యాఖ్యానించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|