యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మిజోరాం ఎన్నికల్లో 72 శాతం పోలింగ్
ఐజ్వాల్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 09:27 IST )
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మిజోరాం అసెంబ్లీలోని 40 సీట్లకు మంగళవారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని మిజోరాం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆర్ బాలకృష్ణన్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విలేకరులతో మాట్లాడుతూ.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 72 శాతం పోలింగ్ నమోదయిందని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మారుమూల ప్రదేశాల్లో చాలా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి నుంచి పోలింగ్ వివరాలు సమయానికి అందలేదన్నారు. 72 శాతం వరకు పోలింగ్ నమోదయి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.

పోలింగ్‌కు సంబంధించి స్పష్టమైన గణాంకాలు బుధవారం సాయంత్రానికి తెలుస్తాయని చెప్పారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 205 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్, యూనైటెడ్ డెమొక్రటిక్ అలయన్స్ (యూడీఏ) ప్రత్యర్థులు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఉగ్రవాదులకు తగిన రీతిలో జావాబిస్తాం: ప్రణబ్
పాక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం: ప్రణబ్
అసోం: రైలులో బాంబు పేలుడు, ముగ్గురి మృతి
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
వాళ్లనిక్కడ ఖననం చేయొద్దు: ముస్లిం కౌన్సిల్
సందీప్ ఇల్లు కాబట్టే వెళ్లాం: కేరళ సీఎం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...