|
| శ్రీనగర్లో కర్ఫ్యూ తరహా ఆంక్షల విధింపు |
| శ్రీనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 15:58 IST ) | |
కాశ్మీర్ లోయలో అధికారిక యంత్రాంగం శుక్రవారం కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించింది. శ్రీనగర్లోని జామియా మసీదుకు వేర్పాటువాదులు నిరసన ర్యాలీని తలపెట్టడంతో అధికారిక యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
శ్రీనగర్లోనూ, కాశ్మీర్ లోయలోని ఇతర ప్రధాన పట్టణాలనూ పెద్దఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించామని అధికారులు తెలిపారు. వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ న్యూఢిల్లీ నుంచి శుక్రవారం తిరిగి రానున్నారు. ఆయన ఈ సందర్భంగా జామియా మసీదుకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.
దీంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరింది. దీంతో శ్రీనగర్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వేర్పాటువాదులు గమిగూడటాన్ని అడ్డుకునేందుకు కర్ఫ్యూ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|