|
| భారత నేవీచే సోమాలియా పైరేట్ల కుట్ర భగ్నం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 12:25 IST ) | |
సోమాలియా తీరంలో సముద్రపు దొంగల కుట్రను భారత నావికా దళం భగ్నం చేసింది. సోమాలియా పైరేట్ల దాడిని నావికాదళం సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు, వారి నౌకను నీటిలో ముంచేసింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో అధికారిక వర్గాలు వివరాలు వెల్లడించాయి.
ఆడెన్ గల్ఫ్లో భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ తబర్ అనే నౌకపై పైరెట్లు కాల్పులు జరిపారు. సోమాలియా తీరంలో ఈ నౌక గస్తీ నిర్వహిస్తుండగా జరిగిన పైరెట్లు దాడిని తిప్పికొట్టేందుకు నౌకా దళం కూడా ఎదురు దాడులు చేసింది.
ఈ దాడిలో పైరేట్ల నౌక నీటిలో మునిగిపోయిందని అధికారిక వర్గాలు తెలిపాయి. గతవారం కూడా రెండు నౌకలను (ఒకటి భారత్కు చెందినది కాగా, రెండోది సౌదీ అరేబియాకు చెందిన నౌక) హైజాక్ చేసేందుకు పైరేట్లు చేసిన యత్నాలను ఐఎన్ఎస్ తబర్ తిప్పికొట్టింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|