యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మాలేగావ్ పేలుడు: ఆర్మీ అధికారిపై మరో కేసు
నాసిక్ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008   ( 10:30 IST )
మాలేగావ్ పేలుడులో తన ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మీ అధికారి ప్రసాద్ పురోహిత్‌పై మరో కేసు నమోదు అయిందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. పూణేకు చెందిన ఒక వ్యక్తికి నకిలీ పత్రాలను ఉపయోగించి ఆయుధ లైసెన్స్‌ను ఇప్పించినందుకు పురోహిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

శిరీష్ యశ్వంత్ దాతే అనే వ్యక్తి సర్కార్‌వాడా పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి తన బంధువుల ద్వారా రివాల్వర్ పొందేందుకు 2005లో పురోహిత్‌కు రూ.20 వేల చెల్లించాడు. లైసెన్స్ పొందేందుకు పురోహిత్ దెవ్లాలీ ఆర్మీ క్యాంపులో నివాసం ఉంటున్నట్టు నకిలీ ధృవపత్రాలను సమర్పించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మాలేగావ్ పేలుడు కేసులో పురోహిత్ అరెస్టు కావడంతో యశ్వంత్ దాతే నాసిక్ నుంచి తాను పొందిన లైసెన్స్ విశ్వసనీయతను పరిశీలించుకున్నారు. నకిలీ ధృవపత్రాలతో తాను ఈ లెసెన్స్ పొందినట్లు తేలడంతో, దాతే స్వచ్ఛందంగా పురోహిత్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పురోహిత్ నకిలీ ధృవపత్రాలు పొందేందుకు సహకరించిన వారిని కూడా తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాశ్మీర్‌లో నేడు తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు
లక్నోలో బాంబు పేలుడు: ఇద్దరికి గాయాలు
పదును తగ్గిన తీవ్రవాద నిరోధక చట్టాలు
ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు: మన్మోహన్
ముంబయి: రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు
సాధ్వి అరెస్ట్ ఎన్నికల ఎత్తుగడ: సుష్మా స్వరాజ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...