|
| లక్నోలో బాంబు పేలుడు: ఇద్దరికి గాయాలు |
| లక్నో (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008 ( 16:41 IST ) | |
ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడులో ఇద్దరు బాలికలు గాయపడ్డారు. నగరంలోని ఖాలా బజార్ ప్రాంతంలో క్రూడ్ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఐష్బాగ్ అనే ప్రదేశంలో ఉన్న చెత్తకుప్పలో ఈ బాంబు పేలింది. గత మూడు రోజుల్లో లక్నోలో జరిగిన మూడో క్రూడ్ బాంబు పేలుడు ఇది.
ఇద్దరు బాలికలు ఆదివారం ఉదయం 9.40 గంటల సమయంలో ఈ ప్రాంతంలో చెత్తలో పనికొచ్చే వస్తువులు ఏరుకుంటుండగా బాంబు పేలింది. స్వల్వ తీవ్రత కలిగిన పేలుడు కావడంతో ఇద్దరు బాలికలు గాయలతో బయటపడ్డారు. ఈ చెత్తకుప్పలో పోలీసులు మరో మూడు పేలని బాంబులను స్వాధీనం చేసుకొని నిర్వీర్యపరిచారు. దీని వెనుక తీవ్రవాద చర్య ఉన్నట్లు తాము భావించడం లేదని ఎస్పీ అఖిల్ కుమార్ తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|