యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కాశ్మీర్‌లో తొలి రైలుకు ప్రధాని పచ్చజెండా
శ్రీనగర్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008   ( 11:08 IST )
కాశ్మీర్ లోయలో తొలి రైలుకు ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం పచ్చజెండా ఊపారు. దాదాపు 117 కిలోమీటర్ల పొడవు కల్గిన ఈ రైలు మార్గంలోని నవ్‌గామ్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని తొలి రైలును ప్రారంభించారు. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభించబడిన ఈ రైలు మార్గం ఇన్నాళ్లకు అందుబాటులోకి రావడం విశేషం.

దక్షిణాన ఉన్న క్వాజీగండ్‌ను ఉత్తరాన ఉన్న బారాముల్లా పట్టణంతో కలిపేలా ఈ రైలు మార్గం నిర్మించబడింది. ఈ విషయమై రైల్వే అధికారులు మాట్లాడుతూ మొత్తం రైలు మార్గం 117 కిలోమీటర్లు అయినా ఇందులో ప్రస్తుతం 66 కిలోమీటర్ల మార్గం మాత్రమే ఉపయోగానికి సిద్ధమైందని తెలిపారు.

ఈ మార్గంలో ప్రయాణించే రైలు బడ్‌గామ్‌ జిల్లాలోని రాజ్‌వన్షర్ నుంచి అనన్తన్గ్‌కు ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించడానికి రైలు ఛార్జీని రూ. 15గా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అలాగే ఈ మార్గంలో రైలు అక్టోబర్ 12నుంచి నిరవధికంగా అందుబాటులోకి వస్తుందని, ఈ మార్గంలో ప్రయాణించే రైలులో ఎనిమిది కోచ్‌లు ఉంటాయని ఆయన తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జమ్మూ-కాశ్మీర్‌లో వచ్చే నెల ఎన్నికలు : ప్రభుత్వం
నేరాల అదుపుకు ఫోరెన్సిక్ సైన్స్ : హోం మంత్రి
ఇరు దేశాల మధ్య సహాకారం అవసరం : ప్రధాని
ప్రధాని శ్రీనగర్ రాక: ఉద్రిక్త పరిస్థితులు
భజ్జీపై వీహెచ్‌పీ, భజ్‌రంగ్ దళ్ కేసులు
ఒరిస్సాలో మళ్లీ హింస: 10 మందికి గాయాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...