యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అమర్‌నాథ్ వివాదం: ఎస్ఏఎస్ఎస్‌కు చర్చల ఆహ్వానం
శ్రీనగర్ (ఏజెన్సీ), బుధవారం, 20 ఆగస్టు 2008   ( 09:08 IST )
శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్)ని అమర్‌నాథ్ భూవివాదంపై జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు కేటాయించి, అనంతరం ఉపసంహరించుకున్న వంద ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఏఎస్ఎస్ గత కొన్నివారాలుగా జమ్మూ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం జమ్మూ- కాశ్మీర్ ప్రభుత్వం మరోసారి చొరవచూపింది. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఎస్ఏఎస్ఎస్‌ను మంగళవారం చర్చలకు ఆహ్వానించింది. శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి కన్వీనర్ లీలా కరణ్ శర్మకు చర్చల ఆహ్వానం పంపామని జమ్మూ- కాశ్మీర్ రాజ్‌భవన్ ప్రతినిధులు తెలిపారు.

అమర్‌నాథ్ భూవివాదానికి పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ సలహాదారు ఎస్ఎస్ బ్లొరియా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ఎస్ఏఎస్ఎస్ చర్చల ఆహ్వానాన్ని స్వాగతిస్తే ఈ కమిటీ సభ్యులతోనే చర్చలు జరపనుంది. జమ్మూ- కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి జీడీ శర్మ, జమ్మూ విశ్వవిద్యాలయ ఉపకులపతి అమితాబ్ మత్తో, అమర్‌నాథ్ ఆలయ బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారి బీబీ వ్యాస్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అహ్మదాబాద్ పేలుళ్లతో సిమి నేత నగోరికి సంబంధాలు
గ్రామీణ ఉపాధి పథకానికి ఐఐటీ, ఐఐఎంల సహకారం
ఆందోళన నిలిపివేత: కాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం
జమ్ము ప్రాంతంలో మరో 4 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
సింగూరు వివాదం: మమతకు బుద్ధదేవ్ చర్చల ఆహ్వానం
పిల్లల మరణాలపై విచారణకు ఆదేశించండి: కేంద్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...