యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పిల్లల మరణాలపై విచారణకు ఆదేశించండి: కేంద్రం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 11:45 IST )
ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో పిల్లల మరణాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సంస్థ డైరెక్టర్‌కు సూచించింది. ఇదిలా ఉంటే కొత్తగా వాడిన మందుల కారణంగా 49 మంది పిల్లలు మరణించలేదని ఎయిమ్స్ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఎయిమ్స్‌లో పిల్లల మరణాల అంశం కూడా చర్చకు వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి నరేష్ దయాల్ విలేకరులతో చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని ఎయిమ్స్ డైరెక్టర్‌ను కోరారు. విచారణ అనంతరం పిల్లల మరణాలపై పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి పంపాలని సూచించారు.

ఇదిలా ఉంటే ఎయిమ్స్ యంత్రాంగం మాత్రం ఈ 49 మంది పిల్లలు తీవ్రంగా జబ్బునపడటంతోనే మృతి చెందారని, వారివి సాధారణ మరణాలేనని తెలిపింది. చికిత్స సందర్భంగా వాడిన మందుల ఫలితంగా వారు మరణించలేదని వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదిక కూడా సోమవారం సాయంత్రం తమ చేతికి వచ్చిందని ఎయిమ్స్ పిల్లల వైద్య విభాగ అధిపతి వీకే పాల్ తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జార్ఖంఢ్ నీలినీడలు
జార్ఖంఢ్: ఆగస్టు 25న మధు కోడా విశ్వాసపరీక్ష
జమ్మూ- కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు ప్రధాని పిలుపు
అమర్‌నాథ్ భూవివాదం: జమ్మూలో స్వచ్ఛంద అరెస్టులు
కాశ్మీర్ లోయలో పరిణామాలపై బీజేపీ ఆందోళన
జమ్మూ- కాశ్మీర్‌లో ఎస్ఏఎస్ఎస్ జైల్ భరో ఆందోళన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...