|
| జార్ఖంఢ్: ఆగస్టు 25న మధు కోడా విశ్వాసపరీక్ష |
| రాంఛీ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 09:02 IST ) | |
జార్ఖంఢ్ ముఖ్యమంత్రి మధు కోడా ఈ నెల 25న రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. జార్ఖంఢ్ గవర్నర్ సయ్యద్ సిబ్తే రజీ సోమవారం రాత్రి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి మధుకోడాని కోరారు. అంతకుముందు మధుకోడా రాష్ట్ర గవర్నర్ రజీని కలుసుకున్నారు. తాను అసెంబ్లీలో విశ్వాసపరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని మధు కోడా ఈ సందర్భంగా గవర్నర్కు తెలియజేశారు.
రాష్ట్ర మంత్రివర్గంతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ముధుకోడా సోమవారం గవర్నర్ రజీని వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఇదిలా ఉంటే జార్ఖంఢ్ ప్రభుత్వానికి ఊపిరిపోస్తున్న జేఎంఎం (జార్ఖంఢ్ ముక్తి మోర్చా) ఆదివారం సాయంత్రం మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో మధు కోడా ప్రభుత్వం మైనారిటీలోకి జారుకుంది. మరోవైపు స్వతంత్రుల మద్దతుతో జార్ఖంఢ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు శిబు సోరెన్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|