|
| కాశ్మీర్ లోయలో పరిణామాలపై బీజేపీ ఆందోళన |
| జమ్మూ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 15:44 IST ) | |
కాశ్మీర్ లోయలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడింది. కాశ్మీర్ ప్రాంతం విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా శాంతపరిచే విధానాన్ని అనుసరించడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది.
కాశ్మీర్ లోయలో వేర్పాటువాద ధోరణి వ్యక్తం అవడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. కాశ్మీర్ తీవ్రవాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, వోహ్రా మెతకవైఖరిని అనుసరిస్తున్నారు. అదే సమయంలో సామాజికంగా అణగదొక్కబడిన జమ్మూ ప్రజల విషయంలో కఠిన వైఖరిని అనుసరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిఓం విలేకరులతో చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|