|
| పంజాబ్లో వరద భీభత్సం: 10 మందికిపైగా మృతి |
| చండీగఢ్ (ఏజెన్సీ), 18 ఆగస్టు 2008 ( 13:35 IST ) | |
పంజాబ్ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో పది మందికిపైగా మృతి చెందినట్టు తెలిసింది. గత 20 ఏళ్లలో పంజాబ్ రాష్ట్రాన్ని వరదలు ఇంత తీవ్రస్థాయిలో ముంచెత్తడం ఇదే తొలిసారి.
గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు 14 మంది మృతి చెందినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వర్షాల కారణంగా నదుల్లో, జలాశయాల్లో నీటిమట్టం అమాంతం పెరిగిపోయింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు వరద తాకిడికి గురైయ్యాయి.
జలంధర్, ఫిరోజ్పూర్, మోగా, భటిండా, సంగ్రూర్, రోపార్ ప్రాంతాలు బాగా నష్టపోయాయని అధికారికవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు అధికారిక యంత్రాంగం 200 గ్రామాలను ఖాళీ చేయించింది. ఆర్మీ రంగంలో దిగడంతో సహాయక కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|