|
| హిమాచల్ ప్రదేశ్లో వరదలు: ప్రభుత్వం అప్రమత్తం |
| సిమ్లా, ఆదివారం, 17 ఆగస్టు 2008 ( 12:08 IST ) | |
హిమాచల్ ప్రదేశ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలవల్ల మూడు జిల్లాలు వరద ముంపు బారినపడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు చెప్పారు. సిమ్లా, కిన్నౌర్, బిలాస్పూర్ జిల్లాల్లో సట్లెజ్ నదికి సమీపంలోని గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
హిమాలయాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సట్లెజ్ నదికి వరద వచ్చి పడింది. భాక్రా నంగల్ డ్యాం నుంచి వరద నీటికి దిగువకు వదులుతున్నారు. డ్యాంకు ఉన్న తొమ్మిది గేట్లలో ఏడింటిని ఎత్తివేసి నీటిని వదిలారు. సట్లెజ్ నీటిని భారీగా వదలటంతో పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చిపడ్డాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|