|
| న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, డీజీపీల సదస్సు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008 ( 20:57 IST ) | |
దేశంలో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీల సదస్సు న్యూఢిల్లీలో శుక్రవారం జరుగుతుంది. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఇటీవల చోటుచేసుకున్న బాంబుపేలుళ్లు కారణంగా దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు.
కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా ఈ సదస్సుకు నాయకత్వం వహిస్తారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఈ పేలుళ్లు జరగటానికి గల కారణాల గురించి కేంద్రం ఆయా రాష్ట్ర డీజీపీల నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటుంది. వివిధ రాష్ట్రాల పోలీసు సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇవ్వడానికి నిఘా వర్గాలు సేవలను వినియోగించుకుంటారు. దీనిపై కేంద్రం సముఖంగా ఉంది.
తీవ్రవాదులు ఆగడాలను నియంత్రించటానికి తీసుకోవాల్సిన చర్చలు గురించి కూడా కేంద్రం ఆయా డీజీపీలకు వివరిస్తుంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూనే పోలీసు వ్యవస్థ పనితీరును పెంచాలని కేంద్రం భావిస్తోంది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|