|
| అమర్నాథ్ వ్యవహారం : బోర్డ్ సభ్యుల రాజీనామా |
| జమ్మూ (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008 ( 17:25 IST ) | |
అమర్నాథ్ వ్యవహారం బుధవారం కొత్త మలుపు తిరిగింది. అమర్నాథ్ దేవస్థానానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకున్న కారణంగా చెలరేగిన ఘర్షణలను నివారించే దిశగా వీరు రాజీనామాకు సిద్ధమయ్యారు.
జమ్మూలో కొద్ది రోజులుగా సాగుతున్న ఘర్షణలను తగ్గించే దిశగా తామీ నిర్ణయానికి వచ్చినట్టుగా బుధవారం బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎనిమిది మంది సభ్యులు పేర్కొన్నారు. వీరంతా రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోరాను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు.
వీరి రాజీనామాతో త్వరలోనే అమర్నాథ్ దేవస్థానానికి కొత్త సభ్యులతో కూడిన బోర్డ్ ఏర్పాటు కానుంది. అమర్నాథ్ దేవస్థానం బోర్డ్ సభ్యులుగా రాజీనామా సమర్పించిన వారిలో జస్టీస్ జీడీ శర్మ, ప్రొఫెసర్ విష్ణుమూర్తి శాస్త్రి, సునిల్ సచ్దేవ, మనోజ్ గౌర్, విమలా ధర్, నీరజా మాట్టో, రఘు మోడీ, అరుణ్కుమార్ అనే సభ్యులు ఉన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|