|
| చందిటాల రోడ్డు ప్రమాదంలో 12 మంది యాత్రికులు మృతి |
| హూగ్లీ, బుధవారం, 6 ఆగస్టు 2008 ( 15:19 IST ) | |
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హూగ్లీ జిల్లా చందిటాల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 యాత్రికులు మృతి చెందారు. మరో 13 మంది గాయాల పాలయ్యారు. నిలబడి ఉన్న బస్సు ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
డియోఘర్ నుంచి పలువురు యాత్రికులు తారకేశ్వర్ వద్దనున్న శివాలయానికి వెళ్ళేందుకు బయలుదేరారు. కపఫారియా సమీపంలో బస్సు ఆగి ఉంది. బస్సులోని యాత్రికలు అక్కడక్కడే తిరుగుతున్నారు. మరికొందరు బస్సులోనే నిద్రిస్తున్నారు. ఇలా ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఒకటి వేగంగా ఢీకొంది. దీంతో 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ సంఘటనలో గాయపడ్డ 13 మందిని స్థానికులు, పోలీసులు సమీపంలోని ఉత్తర ప్రదేశ్లోని శ్రీరాంపూర్ ఆసుపత్రికి తరలించారు. చాలాసేపటి తరువాత వాహనాల రాకపోకలను పునరుద్దరించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|