|
| సామ్రాజ్యవాద కౌగిలికి భారత్: బుద్ధదేవ్ |
ఐక్య ప్రగతి శీల కూటమి ప్రభుత్వం అణు ఒప్పందంతో దేశాన్నికి అమెరికా సామ్రాజ్యవాద కౌగిలికి చేర్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్ర బుద్ధదేవ బట్టాచార్య ఆరోపించారు. ఈ చర్యలే వామపక్షాల మద్దతు ఉపసంహరణకు కారణమయ్యిందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ముజఫర్ అహ్మద్ 120 వ జయంతి సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు.
భారతదేశాన్ని తన కక్ష్యలోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. దీనిని వామపక్షాలు తీవ్రాస్థాయిలో వ్యతిరేకించాయన్నారు. దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే విధంగా అణు ఒప్పందం ఉందన్నారు. ప్రధాని దీనపై వామపక్షాలతో ఏమాత్రం చర్చించలేదన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా అధిగమించారని ఆరోపించారు.
కొంతకాలం వేచి చూసిన వామపక్షాలు మద్దతు ఉప సంహరించుకున్నాయన్నారు. మద్దతు ఉపసంహరించుకున్న వామపక్షాలకు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రామసేతు, అమరనాథ్స్థల వివాదాలను ఇవి ముందుకు తీసుకు వస్తున్నాయన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|