|
| కాశ్మీర్ అల్లర్లపై అఖిలపక్ష సమావేశం |
| న్యూఢిల్లీ(ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008 ( 10:26 IST ) | |
జమ్ము-కాశ్మీర్లో అల్లర్ల రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమరనాథ్ యాత్ర మండలికి కేటాయించిన స్థలాన్ని రద్దు చేయడంపై అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై భారత ప్రధాన మంత్రి బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు నిర్వహించనున్నారు.
అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందుకు అన్ని పార్టీల సహకారంతో పాటు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు చర్చలు జరపనున్నారు. అన్ని పార్టీల అగ్రనేతలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. దేశంలో మతసామరస్యానికి ఆయా పార్టీల సహకారం తీసుకోవాలని కేంద్రం కోరనున్నది.
ఈ సమావేశానికి జాతీయ పార్టీలతో సహీ ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించారు. జమ్ముకాశ్మీర్లోని ప్రధాన పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పాల్గొంటున్నాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను హోం మంత్రి శివరాజ్ పాటిల్ పార్టీ నాయకులకు వివరించనున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|