|
| రైల్వే ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమాః నితీష్ |
| పాట్నా, మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 14:15 IST ) | |
బీహార్లో రైల్వే ప్రాజెక్టుల జాప్యా నికి బాధ్యులెవరో బహిరంగ చర్చ ద్వారా తేల్చుకోవడానికి సిద్ధంకావాలని లాలూ ప్రసాద్ యాదవ్కు ముఖ్యమంత్రి నితీష్కుమార్ సవాలు విసిరారు. తనపై రైల్వే శాఖా మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. సోమవారం జనతా దర్బార్ సందర్భంగా నితీష్ ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.
రాష్ట్రంలోని వివిధ ర్వైలే ప్రాజెక్టులకు స్థలాన్ని సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. తాను రైల్వే మంత్రిగా ఉన్నపుడు ఆ శాఖ భారీ నష్టాల్లో కూరుకుపోయిందన్నఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని లాలుకు సవాల్ విసిరారు. హిట్లర్ ఒక అబద్దాన్ని గోబెల్స్తో వందసార్లు చెప్పించడం ద్వారా దాన్ని నిజమని నమ్మించేందుకు ప్రయత్నించారన్నారు. సరిగ్గా లాలూ ఇలాగే ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. గోబెల్స్ మరో జన్మకు లాలూ నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన వాదనకు తాను కట్టు బడి ఉన్నాను’ అని చెప్పారు. లాలూ కూడా అలాగే ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|