|
| ఉగ్రవాదుల చొరబాటుకు ఐఎస్ఐ ప్రోత్సాహం |
భారత్లో అల్లకల్లోలం రేపడానికి దాదాపు 800 మంది ఉగ్రవాదులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఏకే మిత్రా చెప్పారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రవేశపెట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తోందని ఆరోపించారు.
బీఎస్ఎఫ్కు కొత్తగా నిర్మించిన నివాస భవనాలను సోమవారం ప్రారంభించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. దీంతో చొరబాట్లను నిరోధించేందుకు సరిహద్దుల్లో నిఘా, భద్రతను మరింత పటిష్ఠం చేశామన్నారు. తమ నిఘా విభాగాల ద్వారా తమకు సమాచారం అందిందన్నారు. సరిహద్దుల్లోని తీగకంచెను పటిష్ఠం చేశామన్నారు.
ఆధునిక పరిజ్ఞానంతో చొరబాట్లను సమర్థంగా గుర్తించవచ్చని వివరించారు. కాశ్మీర్లోని మతపరమైన ఘర్షణలు చాలా కాలం ఉండవన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల పర్యావసానంగా పరిస్థితి ఇలా ఉండవచ్చునని వివరించారు. ఇది దాదాపు నెల కాలంగా జరుగుతోందన్నారు. అంతా నియంత్రిస్తామని చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|