యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
తటస్థుల మద్దతు లౌకిక పార్టీలకే: పాశ్వాన్ విశ్వాసం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 19 జులై 2008   ( 13:20 IST )
తటస్థ సభ్యుల మద్దతు లౌకిక పార్టీలకే ఉంటుందని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ నేత రాం విలాస్ పాశ్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే 276 మంది సభ్యుల మద్దతు ఉండగా, మరో ఐదుగురి మద్దతు కూడా లభించే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఢిల్లీలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా తమకే మద్దతు ఇస్తుందన్నారు. విశ్వాస పరీక్ష ఫలితం ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందన్నారు.

న్యూయార్క్‌లో జరిగిన దళిత్, మైనారిటీల ఫోరం ఐదో అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం పాశ్వాన్ ఢిల్లీ తిరిగొచ్చారు. ఈ సదస్సులో చేసిన తీర్మానాల అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన సారథ్యం వహించనున్నారు.

అంటరానితనం నిర్మూలన, ఉచిత, నాణ్యమైన విద్య, దళితులు, మైనారిటీల మానవహక్కుల పునరుద్ధరణ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల రిజర్వేషన్ వంటి అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏకు వ్యతిరేకంగా ఓటు: ఆరెస్పీ విప్ జారీ
పార్టీ ఎంపీలతో సోనియా సమావేశాలు
బేరసారాలకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు: ప్రణబ్
పార్టీ విప్ స్పీకర్‌కు వర్తించదు: బోస్
ఎస్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కొందరు గైర్హాజరు
ప్రధాని మన్మోహన్‌ను కలుసుకోనున్న దేవెగౌడ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...