|
| బేరసారాలకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు: ప్రణబ్ |
లోక్సభలో జూలై 22న జరిగే విశ్వాసపరీక్షకోసం తమ పార్టీ ఎంపీలతో బేరసారాలకు దిగలేదని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. విశ్వాసపరీక్షలో తమ పార్టీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
చండీఘర్లో శుక్రవారం జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ సంస్థ 29వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బేరసారాలకు దిగుతున్నామనడం ద్వారా పార్టీని కళంకితపరుస్తున్నారని ఆరోపించారు.
విశ్వాసపరీక్ష తుది ఫలితాలకై సంయమనంతో వ్యవహరించాలని మీడియాను కోరారు. ఆ పరీక్షలో తాము స్పష్టమైన తీర్పు అందుకోనున్నామన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సాగుతోందని చెప్పిన ఆయన ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|