|
| ప్రధాని మన్మోహన్ను కలుసుకోనున్న దేవెగౌడ |
| బెంగుళూరు (ఏజెన్సీ), 18 జులై 2008 ( 16:27 IST ) | |
జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ శనివారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలుసుకోనున్నారు. ఈరోజు ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా హెచ్డీ దేవెగౌడకు ఫోన్ చేశారు. ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని దేవెగౌడను ప్రధాని ఈ సందర్భంగా కోరారు.
అయితే ప్రధాని ప్రతిపాదనపై దేవెగౌడ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. విశ్వాసపరీక్షలో ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానితో మాట్లాడిన అనంతరం దేవెగౌడ తెలిపారు. ప్రధాని కోరిక మేరకు శనివారం న్యూఢిల్లీలో ఆయనను కలుసుకోబోతున్నట్టు దేవెగౌడ వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|