|
| ఎస్సీ సమావేశానికి 16 మంది ఎంపీలే హాజరు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 18 జులై 2008 ( 16:07 IST ) | |
లోక్సభలో ఈ నెల 22న యూపీఏ ప్రభుత్వాన్ని బలపరీక్షలో గట్టెక్కిస్తుందనుకున్న సమాజ్వాదీ పార్టీలో శుక్రవారం వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ఎంపీల సమావేశం ఈరోజు జరిగింది. పార్లమెంట్లో విశ్వాసపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చలు జరిపేందుకు పార్టీ అగ్రనేతలు ములాయం సింగ్, అమర్ సింగ్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని సమర్థించిన సమాజ్వాదీ పార్టీ ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో యూపీఏకు మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు పార్టీకి ఎంపీల్లో ఈ నిర్ణయంపై ఏకాభిప్రాయం లేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎస్పీ సమావేశానికి మొత్తం 39 మంది ఎంపీల్లో 16 మంది మాత్రమే హాజరయ్యారు. ఎస్పీకి చెందిన 39 మంది ఎంపీల్లో ఒకరు జైల్లో ఉండగా, మరో ఇద్దరిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|